1.హెచ్ వన్ బీ వీసా ఇంటర్వ్యూ పై అమెరికా కీలక ప్రకటన
హెచ్ 1, ఎల్ 1, వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.కాన్సులెట్ వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
2.ఆటా ఆధ్వర్యంలో సెమినార్
హైదరాబాద్ తెలుగు సంఘం ఆటా హైదరాబాద్ నగరం లో బిజినెస్ సెమినార్ 2021 ని నిర్వహించింది.
3.కరోనా లో మరో వేరియంట్
కరోనా లో కొత్త రకం వేరియంట్ ఒమి క్రాన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా, తాజాగా డేలిమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కారణంగా కొన్ని దేశాల్లో కేసులు పెరిగాయి.
4.నౌక లో అగ్నిప్రమాదం .48 మంది మృతి
బంగ్లాదేశ్ లో ఓ నదిలో ప్రయాణిస్తున్న నౌక లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం తో 48 మంది సజీవ దహనం అయ్యారు.
5.ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ .క్యూబా శాస్తవ్రేత్తల ప్రయోగం
ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ అందించే విధంగా కూడా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు.
6.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
7.షాంపూ ల్లో క్యాన్సర్ కారకాలు.30కిపైగా బ్రాండ్లను రీకాల్ చేసిన కంపెనీ
షాంపులు, డియోడ్రెంట్ లలో అగ్రగామి కంపెనీగా పేరు పొందిన ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తమ ఉత్పత్తులైన ప్యాంటీన్ షాంపులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.మొత్తం 30 కి పైగా బ్రాండ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.వీటిల్లో క్యాన్సర్ కారకాలు ఉండడమే కారణం.
8.వెనిజులాలో 90 శాతం వ్యాక్సినేషన్
వెనిజులా దేశం లో దాదాపు 90 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది.
9.సూకీ తో విదేశాంగ కార్యదర్శి భేటీకి మయన్మార్ ప్రభుత్వం నిరాకరణ
మయన్మార్ పదవీచ్యుత నేత అంగసాన్ సూకీ , విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ పింగ్లా మధ్య సమావేశానికి అక్కడి జుంటా ప్రభుత్వం అనుమతించలేదు.