బక్రీద్ పర్వదినం( Bakrid Festival ) సందర్భంగా జిల్లా ప్రజలకు ముస్లిం సోదరులకు జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) శుభాకాంక్షలు తెలిపారు.బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు బక్రీద్ పండగ వేల పోలీసు బందోబస్తుకు సంబంధించి డీఎస్పీలు,సిఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగలు మత సమరసానికి ప్రతీకని అన్నారు.బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ, నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, ప్రజలందరూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.ఇతరుల మనోభావాలు, భావోద్వేగాలను కించపరిచే విధంగా ఆకతాయి పనులకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిబ్బంది అందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.డీఎస్పీలు, సిఐలు సిబ్బంది ఈ సమావేశం నందు పాల్గొన్నారు.