సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాపులో మంగళవారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు.లక్షా యాభై వేల నగదు, 5 తులాల బంగారం,5 కేజీల వెండి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు.