సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్ర గ్రంధాలయంలో నిర్వహిస్తున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి బిడ్డకి అందవలసిన వ్యాక్సిన్ సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
మిషన్ ఇంద్రధనుస్సు ఈ నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోని పిల్లలను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేసేవిధంగా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ.బిచ్చు నాయక్, సూపర్వైజర్ స్వరూప కుమారి,సంధ్యారాణి,మాధవి పాల్గొన్నారు.