సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ బుడే సాహెబ్ అనే రైతు తన భూమిని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలీస్ పటేల్ రాజు,అతని కుమారుడు భార్గవ్ కబ్జా చేసి,పత్తి చేలోకి పోకుండా చుట్టూ పెన్సింగ్ వేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో బాధిత రైతు మాట్లాడుతూ సర్వే నెంబర్ 247 లో తన తాతముత్తాతల దగ్గర నుండి వచ్చిన వారసత్వ భూమిని,తనకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ పట్టా కూడా ఉన్నా అక్రమంగా,అన్యాయంగా,దౌర్జన్యం చేస్తూ అక్రమిస్తున్నారని,తనకు ఇద్దరు అడపిల్లలని, అధికారులు తనకు న్యాయం చేయాలని దీనంగా వేడుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది.
Latest Suryapet News