పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీకి చెందిన రుద్రపంగు శివయ్య(50)గా గుర్తించారు.

 The Corpse Of The Man In The Tamarind Project-TeluguStop.com

శివయ్య రోజూవారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపేవాడు.గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను గురువారం తెల్లవారుజామున ప్రాజెక్టులోని మూడవ గేట్ నెంబర్ వద్ద నీటిలో తేలియాడుతూ మృతదేహంగా కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube