చిన్నారిని చితకబాదిన టీచర్‌...ఆందోళనకు దిగిన పేరెంట్స్

సూర్యాపేట జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిని ఓ టీచర్‌ చితకబాదడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న ధరావత్‌ పార్వతి-బాలు దంపతుల కుమారుడు సహాస్‌ ప్రిన్స్‌ ను ఈ విద్యా సంవత్సరమే స్థానిక లయోలా స్కూల్‌లో నర్సరిలో జాయిన్‌ చేయించారు.

 Teachers Beat Student Parents Protest In Suryapet District, Teachers, Student ,p-TeluguStop.com

విద్యాబుద్ధులు నేర్పించమని తల్లిదండ్రులు బాబును బడికి పంపగా తేజస్విని అనే ఉపాధ్యాయురాలు బాబును సోమవారం బెత్తంతో 14 దెబ్బలు కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు.మంగళవారం పాఠశాలలో ఈ విషయమై తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

ప్రిన్సిపల్‌ సునీల్‌, కరస్పాండెంట్‌ లూయిదాస్‌ ఉపాధ్యాయురాలిని తొలగిస్తామని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినలేదు.చివరికి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube