నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.విజయ్ కుమార్ తెలిపారు.
మండలంలోని రావులపెంట మూసి వాగు నుంచి తడకమల్ల గ్రామానికి చెందిన తంగేళ్ల జానకి రెడ్డి, చనగాని శ్రీనివాస్,జిల్లా రవి తమ ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరగాలిస్తుండగా రావులపెంట శివారులో పట్టుకొని స్టేషన్ కు తరలించామన్నారు.ఈ మేరకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.