సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల( six-guarantees )లో ఒకటైన ఆర్టీసి బస్సులోమహిళలకు ఉచిత ప్రయాణం( Free Bus Travel, ) నేటి నుండి అమలు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసి డిపో మేనేజర్ తెలిపారు.
ఈ పథకం అమలు తీరుపై ఉన్నతాధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్ లో డిపో సిబ్బందితో పాటు ఆయన పాల్గొన్నారు.అనంతరం డిపో ఎండి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఆర్టీసి బస్సులలో మహిళలకు నేటి మధ్యాహ్నం నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సూచించారు.
ప్రయాణించే మహిళల నుండి ఆధార్ కార్డ్( Aadhaar Card ) లేదా తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తెలిపే ఏదైనా ఐడి కార్డ్ చూపినా టిక్కెట్ లేకుండా ఎంత దూరమైనా ఫ్రిగా తీసుకెళ్లాలని చెప్పారు.