నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ( Rythu Runa Mafi ) కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు చర్చించనున్నారు.రుణమాఫీ యాప్లో వివరాల నమోదు,ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు
.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.