నల్లగొండ జిల్లా/హైదరాబాద్:గత కొద్ది రోజులుగా పిల్లాపాపలతో కలిసి విధులు బహిష్కరించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె చేసిన పంచాయతీ సెక్రెటరీలకు చుక్క ఎదురైంది.ఎన్ని ధర్నాలు సమ్మెలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదని తేల్చి చెప్పింది.
రేపటిలోగా విధుల్లోకి హాజరైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని,లేని పక్షాన గతంలో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించి మెరిట్ లిస్టు ఆధారంగా ఉద్యోగాలు జారీ చేస్తామని తెలిపింది.
ఉద్యోగాలు రెగ్యులర్ చేయడం అంటే ఆశ తమాషా కాదని దానికి కొన్ని విధివిధానాలు అర్హతలు నిబంధనలు ఉంటాయని సిఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
ఇప్పటికే నాలుగు వేలకు పైగా పంచాయతీ సెక్రటరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని తేల్చింది.