నల్లగొండ జిల్లా:తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ నుండి తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రేస్ సీనియర్ నేత,టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు మెత్తబడ్డారు.గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క తనతో చర్చించారని తెలిపారు.
నిన్న,ఇవాళ అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరిగిన కసరత్తు జరిగిందని,అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని అన్నారు.అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది.
సర్వేల ప్రకారం మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక ఉంటుంది.నేను మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.