కాశ్మీర్ను హార్టికల్చర్ స్టేట్ అంటారు.వ్యవసాయం, ఉద్యానవనాలు ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, అయితే ఈసారి వాతావరణం కారణంగా ఇక్కడి తోటల పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు.
మార్చి నుంచి ఏప్రిల్ మొదటి రెండు వారాల పాటు వేడి ఇలాగే ఉండడంతో యాపిల్ ఫార్మింగ్లోని పూలు దెబ్బతిన్నాయి.ఎండలు విపరీతంగా ఉండడంతో 50 శాతం యాపిల్ పూలు వాడిపోయాయని రైతులు చెబుతున్నారు.
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు గులాం రసూల్ మీర్ ఈసారి బంపర్ ఉత్పత్తిని ఆశించామన్నారు.అయితే వేడికి యాపిల్ చెట్ల పూలు రాలిపోవడం ప్రారంభించాయాన్నారు. ఒక చెట్టుతో మొదలై, ఆ తర్వాత క్రమంగా చెట్లన్నింటి పూలు వాడిపోయి రాలిపోయాయన్నారు.పంట దెబ్బతినడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మీర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రెండు వారాల్లోనే పూలు వాడిపోయాయని, 50 శాతం పొడి వాతావరణం కారణంగా తోటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మొంగాబే-ఇండియా అంచనా ప్రకారం మంచి పంటను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భారీ ఆదాయాలు వస్తాయని ఆశ పడ్డామని మీర్ చెప్పాడు.రూ.7 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఇప్పుడు రూ.4 లక్షలకు మించి ఆదాయం రాలేదని మీర్ తెలిపాడు.