తమ ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలని స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు.కానీ, రసాయనాలు అధిక ఉంటే మేకప్ ప్రోడెక్ట్స్ను వాడటం, వాతావరణంలో వచ్చే మార్పులు, ఎండల ప్రభావం, ఆహారపు అలవాట్లు, మృత కణాలు పేరుకుపోవడం వంటి కారణాల వల్ల చర్మ ఛాయ తగ్గుతూ ఉంటుంది.
దాంతో తగ్గిన రంగును పెంచుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్, సీరమ్స్ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
వాటి వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో పక్కన పెడితే.
పుల్లటి పెరుగుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మాత్రం మీ ముఖం ఎంత నల్లగా ఉన్నా తెల్లగా మారడం ఖాయం.మరి ఎందుకు లేటు పుల్లటి పెరుగుతో ముఖ చర్మాన్ని తెల్లగా ఎలా మార్చుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక టమాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు, వన్ టేబుల్ స్పూన్ టమాటో పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, పావు స్పూన్ ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం నార్మల్ వాటర్తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ను రాసుకోవాలి.
ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని రోజుకు ఒకసారి ట్రై చేస్తే ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.అలాగే పిగ్మెంటేషన్, ముదురు రంగు పాచెస్ వంటి సమస్యల నుండి సైతం ఉపశమనం లభిస్తుంది.