నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్ కు గురై చింతరెడ్డి సైదిరెడ్డి,లేకిరెడ్డి మంగమ్మకు చెందిన రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి.సోమవారం ఉదయం రోజువారీగా మేతకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్ళాయి.
మేత వేసుకుంటూ వెళుతున్న క్రమంలో పొలం గట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగను తాకడంతో విద్యుత్ ఘాతానికి గురై రెండు పాడి గేదలు అక్కడికక్కడే మృతి మృతి చెందాయి.మృతి చెందిన పాడి గేదెలు ఒక్కొక్కటి సుమారు 40 వేల రూపాయల వరకు ఉంటాయని,పాడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.