నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆటోలో అక్రమంగా నల్ల బెల్లం, పట్టిక ఐడి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కొండమల్లేపల్లి పోలీసులు బుధవారం తెల్లవారుజామున నల్ల బెల్లం తరలిస్తున్న ఆటోను పట్టుకున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు.
ఆటోలో 3 క్వింటాళ్ల 60 కేజీల నల్లబెల్లం,సారా తయారీకి ఉపయోగించే 80 కేజీల పట్టిక ఐడిని గుర్తించి ఆటోతో సహా స్వాధీనం చేసుకున్నామని,ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఎస్ఐ చెప్పారు.