వర్షాల నేపథ్యంలో ప్రయాణ జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాల పడుతున్న దృష్ట్యా వాహనదారులు,ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రయాణ సమయంలో రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపు తప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

 Travel Precautions Should Be Taken In View Of Rains District Sp Chandana Deepti,-TeluguStop.com

కాబట్టి వాహనాలు అతి వేగంగా నడపవద్దని అన్నారు.వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలని,వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళకుండా ఉండాలని అన్నారు.

అలాగే ఈదురు గాలులు బాగా వీస్తున్న క్రమంలో వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు వర్షం పడే సమయంలో భారీవృక్షాల కింద నిలపడకూండా ఉండాలన్నారు.అత్యవసర సమయంలో సహాయం కొరకు డయల్ 100 కి కాల్ చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube