నల్లగొండ జిల్లా:తెలంగాణ సర్కార్ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంగళవారం జీవో జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ,ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలకు 63.44 లక్షల యూనిఫామ్లు కుట్టే అవకాశం దక్కనుంది.
ఈ యూనిఫామ్స్ను 45 రోజుల్లో కుట్టించి ఇవ్వాల్సి ఉంటుంది.ఆయా జిల్లాల పరిధిలో శాఖల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందించాలని సూచించారు.