ప్రజా ఆశీర్వాద సభకు మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా ఆధ్వర్యంలో తరలిన గ్రామ ప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్( kcr ) ప్రజా ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్లలో నిర్వహిస్తున్నందున ఎల్లారెడ్డిపేట మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా మహమ్మద్ అజ్జు ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన గ్రామస్తులు బస్సులో తరలి వెళ్లారు.ఈ సందర్భంగా అప్సర్ ఉన్నిసా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కేటీఆర్ ను ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ ను ఎన్నుకోవాలని అన్నారు.

 The Village People Moved Under The Leadership Of Mandal Woman President Apsar Un-TeluguStop.com

తరలి వెళ్ళిన వారిలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నంది కిషన్, మీసం రాజం, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube