అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) హెడ్ క్వార్టర్ లో గత 08 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న (జర్మన్ షెఫర్డ్) సంతతికి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మరణించినది.

 District Sp Akhil Mahajan Ips Paid Tributes To Jagilam Tango Who Died Of Illness-TeluguStop.com

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్( Head Quarters) లో పోలీస్ అధికారులు , పోలీస్ జాగిలం హ్యాండ్లర్ లక్ష్మణ్ తో కలసి ట్యాంగో పై పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించి ట్యాంగో సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్యాంగో గత 08 సంవత్సరాల నుండి జిల్లాలో 15 హత్య కేసులలో, 84 దొంగతనాలలో మొత్తంగా 99 కేసులలో నిందుతులను , గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించదని కొనియాడారు.2017 సంవత్సరంలో ట్యాంగో తన హ్యాండ్లర్ లక్ష్మణ్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో 08 సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ లక్ష్మణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube