రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పిటిసిల పదవి కాలం నేటితో ముగియనుండగా వారిని జిల్లా జడ్పీ కార్యాలయంలో బుధవారం వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు కలిసి ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.
వారి వెంట సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్ నాయకులు గూడూరు ప్రవీణ్, ప్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, తదితరులు ఉన్నారు.