ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వాతంత్ర్య సమర యోధుడు, జాతిపిత మహాత్మగాంధీ జయంతి ( Mahatma Gandhi Jayanti )వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో మహాత్మగాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

 Collector Sandeep Kumar Jha Paid Tributes To Mahatma Gandhi Jayanti , Collecto-TeluguStop.com

అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతిపిత చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సిరిసిల్ల లోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఇక్కడ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube