కార్యకర్తల్ని కంటికి రెప్పల కాపాడుకుంటాం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోమిటిశెట్టి తిరుపతి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామానికి చెందిన కంచర్ల తిరుపతి అనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గడిచిన రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కి వీర విధేయుడుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన తిరుపతి మా నుంచి భౌతికంగా దూరమైన వారి ఆలోచనలు వారి ఆశయాలు మా మదిలో ఎప్పుడు ఉంటాయని కొని ఆడారు.

 We Will Protect The Activists - District Congress Vice President Komitishetti Ti-TeluguStop.com

ఈ సందర్భంగా కోమిటిశెట్టి తిరుపతి వారి కుటుంబానికి 5,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.భవిష్యత్తులో పిల్లల చదువు నిమిత్తం అన్ని రకాల సహాయాలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్,రఘువీర ప్రసాద్, మంత్రి అంజయ్య, మమ్మద్, అమీర్, నాగరాజు, అస్లం, అంజయ్య, హౌస్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube