రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలో టీచర్స్ కు సముచిత గౌరవాన్ని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి సలాం చేస్తున్నామని టీచర్స్ యూనియన్ సభ్యులు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం స్థానిక పాత బస్టాండులో టీచర్స్ మార్వాడి గంగరాజు, కదిరే శ్రీనివాస్ గౌడ్ కలిసి సీఎం చిత్రపటానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో టీచర్స్ కు ప్రాధాన్యత కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు.
రెండు దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు భాషా పండితులు వ్యాయామ టీచర్లు ఎదురుచూస్తున్న కలను ఈ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.
మల్టీజోన్ వన్ టూ కలిపి 10851 మంది టీచర్స్ పదోన్నతులు పొందడం జరిగిందని పేర్కొన్నారు.అదేవిధంగా మరో ఎనిమిది వేల మందికి మల్టీజోన్2లో వారం రోజుల్లో పదోన్నతులు రానున్నట్టు వివరించారు.
గత ప్రభుత్వ హయాంలోనే భాషా పండితులు పీఈటీల పదోన్నతుల ఉత్తర్వులు సిద్ధం చేసినప్పటికీ కోర్టుల్లో పలు కేసులు పెండింగ్లో ఉండడం వల్ల ఆ ఉత్తర్వులను జారీ చేయలేదని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరువ చూపడంతో హైకోర్టు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు .