రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్.స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, కోడె ముక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో విప్ కి వేదోక్త ఆశీర్వచనం చేసారు.
ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతి రావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ ఆశోక్ ఉన్నారు.