పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 17 వసంతాల కలయిక

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 2007-2008 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించి 17 వసంతాల తర్వాత పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

 Alumni Association Of Malyala Village Zilla Parishat School Students,alumni Asso-TeluguStop.com

ఒకరికొకరు తమ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.పాఠశాలలోని తమ తరగతి గదులు, వాటిలోని బెంచీలు, అక్కడ గడిపిన క్షణాలు, చేసిన అల్లరి, మాస్టర్లతో పెట్టించుకున్న చీవాట్లు గుర్తు చేసుకున్నారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.

ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నామని దీనికి కారణం ఆరోజుల్లో గురువులు నేర్పిన క్రమశిక్షణే అన్ని కొనియాడారు.మధ్యాహ్నం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు దేవేందర్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంతోష్ ,మధుసూదన్, షరీఫ్, హరికిషన్, ప్రణయ్ కుమార్, లింగయ్య, జయలక్ష్మి , నరేందర్ , పూర్వ విద్యార్థులు అనుదీప్, హరీష్, సాయి, శ్రీశైలం, శేఖర్, రేఖ మాధవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube