రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండల ధర్మారం గ్రామ పరిధిలో సావనపల్లి స్వామి (40)అనే వ్యక్తి బుధవారం 10 గంటల ప్రాంతంలో అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడికి భార్య పద్మ, 2సంవత్సరాల బాబు ఉన్నారు .
మృతుడికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అప్పుల కారణంగా అమ్మివేసాడని, తన భార్య పద్మ కి కూడా హృదయ చికిత్స కావడం, ఖర్చులు పెరగటంతో మనస్తాపం చెంది బుధవారం ఆందజా 10 గంటలకు స్వామి ఉరి వేసుకోవడం జరిగిందని మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు పరిశీలించి నమోదు చేయడం జరిగిందని కొనరావుపేట ఎస్సై తెలిపారు .