రాజన్న సిరిసిల్ల జిల్లా: అత్తమామలు తనను పట్టించుకోకుండా గాలికి వదిలేసారని ఓ వివాహిత భర్త ఇంటి ముందు ధర్నా చేసింది.వివరాల్లోకెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారూపాక గ్రామానికి చెందిన బూద గీతాంజలి రాజు ను వివాహం చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాక అత్తమామలు తనను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.తను పనిచేసుకుంటూ తన ఆరు సంవత్సరాల కొడుకును పోషిస్తున్నానని తనకు ఏ ఆధారం లేదని మీడియాతో వెల్లడించింది.
నాకు నా కొడుకుకు ఏదైనా ఆధారం కల్పించాలని భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్లు పేర్కొంది.