రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబానికి ఆసరాగా ఉన్న సమయంలో ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది.అనుకోని రూపంలో విధి అనారోగ్యం రూపంలో వెంటాడింది.
ఆపరేషన్ చేయవలసిన రావడంతో పది లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో నిస్సహాయ స్థితిలో కుటుంబం సహాయం కోసం ఎదురుచూస్తోంది.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్వాల్ సతీష్ సెలూన్ లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.
ఇటీవల సతీష్ కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్లను సంప్రదించాడు.పెద్ద పేగు తొలగించాలని డాక్టర్లు తెలిపారు.
దీనికోసం 10 లక్షల వరకు ఖర్చవుతుందని తెలపడంతో సతీష్ కు సహాయం కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూస్తోంది.ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
మానవత్వంతో మనం అందించి చిన్ని సహాయం సతీష్ ప్రాణాలను కాపాడుతుంది.సహాయం అందించే దాతలు ఫోన్ పే 9640928269 ద్వారా అందించి తమ బిడ్డను కాపాడాలని పేద కుటుంబం వేడుకుంటుంది
.