మాజీ మంత్రి కెటిఆర్ పిఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: శనివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ముస్తాబాద్ మండలం బదనకల్ స్టేజ్ వద్ద మహేందర్ రెడ్డి కీ సంబందించిన TS 09 ఈ యూ 6008 అనే నంబర్ గల క్రేటా కారు ఢీ కొట్టగా వృద్ధుడి కుడి కాలు విరిగిపోయింది.వివరాలు ఇలా ఉన్నాయి.

 Former Minister Ktr Pa Kumbhala Mahender Reddy Car Injured An Old Man, Former Mi-TeluguStop.com

నారాయణరావుపేట మండలం బంజపల్లి గ్రామానికి చెందిన దొందడి మల్లయ్య బదనకల్ స్టేజ్ వైపు ద్వి చక్ర వాహనం పై వస్తుండగా మల్లయ్య కు క్రేట కారు ఢీ కొత్తగా కుడి కాలు విరిగింది.

ప్రస్తుతం మల్లయ్య సిరిసిల్ల లోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా పారిపోగా ముస్తాబాద్ పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించి ప్రమాదానికి కారణమైన కారు మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కి సంబందించిన కారు గా గుర్తించినట్లు సమాచారం.

ప్రమాద సంఘటన పై బాధిత కుటుంబం ముస్తా బాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube