రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సాగునీటి వరప్రదాయిని అయిన సింగ సముద్రం నుండి ఎల్లారెడ్డి పేట గ్రామ పొలాలకు సాగునీరు వచ్చే క్రమంలో కోరుట్లపేట గ్రామ శివారు లో గల కొరుట్లపెట పంపుల వద్ద నుండి ఎల్లారెడ్డి పేట కు సాగునీరు రాకుండా తరచూ అక్కడి కోరుట్ల పేట, బొప్పపూర్ రైతులు పెద్దపెద్ద బండ రాళ్ళు అడ్డు పెడుతున్నారని సముద్ర నీరటి లు బాధ రాజు,రేసు రాజయ్య లు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా కోరుట్ల పేట పంపుల వద్ద కు వెళ్లి ఆయన పరిశీలించారు.కోరుట్ల పేట విఆర్ఏ చొక్కం నారాయణ ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పిలిచి ఎల్లారెడ్డి పేట గ్రామానికి న్యాయబద్దంగా రావాల్సిన సాగు నీరు అపవద్దని ఏదైనా సాగు నీరు సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
వెంటనే మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఫోన్ లో మాట్లాడి ఇరు గ్రామాల మధ్య నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ జయంత్ కుమార్ ను కోరగా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో ఆయన అన్నారు.