మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికై విజయం సాధిద్దాం...

కవ్వంపల్లి గెలుపు కొరకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి : అధికార ప్రతినిధి పసుల వెంకటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ( Ellantakunta )మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో గడప గడప ప్రచారం కాంగ్రెస్ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి,ఎంపీటీసీ కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పాశం రాజేందర్ రెడ్డి నిర్వహించినారు.

 Let's Achieve Success For The Development Of Manakondur Assembly Constituency E-TeluguStop.com

అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కొరకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని పదేళ్ళుగా ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసారి గుణపాఠం చెప్పాలని అన్నారు.

పదేళ్ళుగా అధికారంలో అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిన డబ్బులతో వచ్చి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్న దొంగలను తరిమి కొట్టాలని ప్రజలకు సూచించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాలు, గ్యారంటీలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కేతిరెడ్డి వెంకట్రెడ్డి( Ketireddy Venkatreddy ), కేతిరెడ్డి నవీన్ రెడ్డి, కరివేద రవీందర్ రెడ్డి, బండారి రవీందర్, శరత్ రెడ్డి, పసుల లచ్చయ్య, పసుల కేశయ్య, శనిగరం కొమురయ్య, గన్నారం పోశయ్య, ఈర రాజయ్య లచ్చయ్య , కొమురయ్య , ఎల్లయ్య , పరశురాములు, శ్రీనివాస్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube