1.తానా ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ఆధ్వర్యంలో డల్లాస్ లో పుస్తక మహోధ్యమం ఘనంగా జరిగింది.ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.
2.వీసాల జారీ పై సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
వలసదారులకు ఇచ్చే వీసా లపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వీసాల రెన్యువల్ కు ఎటువంటి ఫీజు తీసుకోబోమని ప్రకటించింది.
3.పౌరులు, వలసదారులకు కువైట్ హెచ్చరిక
కొత్త కరోనా వేరియంట్ ఒమెక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో పౌరులు, వలసదారులు దేశం విడిచి వెళ్లకుండా ఉంటే మంచిది అని హెచ్చరికలు జారీ చేసింది.
4.పాక్ చైనా మధ్య చేపల వివాదం
పాకిస్థాన్ చైనా మధ్య చేపల వివాదం మొదలైంది.తమ దేశానికి చెందిన గాల్వార్ పోర్ట్ లో చైనా చేపల వేట కొనసాగిస్తూ తమ ఉపాధి దెబ్బతీస్తోందని పాక్ ప్రజలు చైనా పై మండి పడుతున్నారు.
5.సౌదీ లో ఓమిక్రాన్ కేసు నమోదు
సౌదీ అరేబియాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది.
6.12 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వైరస్
12 దేశాలకు ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది.
7.దబ్ల్యూ హెచ్ వో కీలక సూచన
ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు కీలక సూచన చేసింది.ఒమిక్రాన్ వైరస్ విషయంలో అతిగా స్పందించవద్దు అని కోరింది.
8.రెండు వారాల్లో పిల్లలకు కరోనా వాక్సిన్
యూరోపియన్ లో కోవిడ్ వాక్సిన్ ని ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీలైన బయో ఎన్ టెక్ / ఫైజర్ లు మరో రెండు వారాల్లో పిల్లలకు వాక్సిన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు యురోపియన్ కమిషన్ చీఫ్ తెలిపారు.
9.బంగ్లాదేశ్ ప్రధానికి ప్రాణ హాని.విదేశాలకు వెళ్లేల అనుమతి ఇవ్వాలని వినతి
తీవ్ర అశ్వస్థకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా అనారోగ్య దృష్ట్యా విదేశాలకు మెరుగైన చికిత్స నిమిత్తం వెళ్లేందుకు అనుమతించాలని వైద్యులు కోరుతున్నారు.
10.ఓమి క్రాన్ పై సౌత్ ఆఫ్రికా హెచ్చరిక
ఓమి క్రాన్ పై సౌత్ ఆఫ్రికా ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.ప్రస్తుతం ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది అని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.