తండ్రి జీతం ఆపేసిన తహశీల్దార్- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పిల్లలు

సుర్యాపేట జిల్లా:తండ్రి జీతం రాక తమ జీవితాలు సందిగ్ధంలో పడ్డాయని,ఎందుకు జీతం డబ్బులు ఆపేశారో తెలియక అయోమయంలో ఉన్నామని, తమను ఆదుకోవాలని ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎడ్ల మల్లయ్యకు మే నెల జీతం అకారణంగా,ముందస్తు సమాచారం ఇవ్వకుండా బిల్లు చేయమంటే చేయకుండా ఆపేశారని ఆరోపిస్తూ వీఆర్ఏ ఇద్దరు పిల్లలు కుమారుడు ఎడ్ల యశ్వంత్ కుమార్ (డిగ్రీ ద్వితీయ సంవత్సరం),కూతురు ఎడ్ల సురంజిత (ఎమ్మెస్సి అగ్రికల్చర్) మద్దిరాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

 Children Who Lodged A Complaint At The Tahsildar-police Station Where Their Fath-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ జీతం డబ్బులు లేక తమ చదువులు ఆగిపోవడం మాత్రమే గాక,పోషణకు కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.మానసికంగా మా తండ్రి ఆవేదనకు గురయ్యారని పిటిషన్ లో పేర్కొన్నారు.

మద్దిరాల మండల తహశీల్దార్ పై చర్యలు తీసుకొని జీతం ఇప్పించాలని పోలీస్ స్టేషన్ లో విఆర్ ఎ కొడుకు (Degre 2nd year) , (msc agriculture) ఫిర్యాదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube