సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండల కేంద్రలోని శ్రీ సాయి వైన్స్ షాపులో మద్యం కల్తీ జరుగుతుందన్న సమాచారంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సిఐ ఏ.నరేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో కల్తీ జరిగిన విషయాన్ని గుర్తించి 10 సిగ్నేచర్ 180 ఎంఎల్ బాటిల్స్ సీజ్ చేసి,కోదాడ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.కోదాడ ఎక్సైజ్ సిఐ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కేసు నమోదు చేశాం.
ఉన్నతాధికారులకు పంపిస్తాం.వారి ఆదేశాల మేరకు త్వరలోనే వైన్స్ షాప్ సీజ్ చేస్తాం అని తెలిపారు.