ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు.ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ఖర్గే రాష్ట్రానికి రానున్నారని తెలుస్తోంది.
ఖర్గే పర్యటన నేపథ్యంలో పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.పేదల భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వమే కబ్జా కోరుగా మారిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనన్న రేవంత్ రెడ్డి పేదలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని వెల్లడించారు.