గరిడేపల్లిలో దొంగల బీభత్సం

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగలు పడి భీభత్సం సృష్టించారు.బాధితులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో పడ్డ దొంగలు ఐదు తులాల బంగారం,రామచంద్ర అనే వ్యక్తి ఇంట్లో రెండు లక్షల నగదు,తులం వెండిని దొంగలించిన విషయం వెలుగులోకి వచ్చింది.

 Robbery In Garidepally, Robbery ,garidepally, Garidepally Police, Suryapet Distr-TeluguStop.com

రెండిళ్లలో కుటుంబసభ్యులు ఊర్లకు పోయిన సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది.తిరిగొచ్చి చూసే సరికి బీరువా తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ సైదులు తెలిపారు.

అయితే గత కొంతకాలంగా గరిడేపల్లి మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు.గ్రామాలలో ఇంటికి వేసిన తాళాలను చూసి టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు.

అంతేకాకుండా రైతులు సాగు చేసే మోటర్లు,వైర్లను కూడా దొంగలిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు.గరిడేపల్లి మండలంలో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నా అరికట్టడంలో గరిడేపల్లి పోలీసులు అరికట్టడంలో విఫలమవుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దొంగతనం జరిగిన తర్వాత వచ్చి ఏమి జరిగిందని అడగటం తప్ప పోలీసులు చేసిందేమీ లేదని ప్రజలు అంటున్నారు.పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నామంటున్నారని, పెట్రోలింగ్ చేస్తే ఇలా దొంగతనాలు జరుగుతాయా అని వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube