ఎండుతున్న పంటలను కాపాడాలంటూ రైతులు రాస్తారోకో

సూర్యాపేట జిల్లా:పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందక ఎండి పోతున్నాయని, వెంటనే పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal )లోని ధర్మాపురం, భక్తాళపురం,రంగయ్యగూడెం, తుల్జారావుపేట గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కొటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు.

 Farmers Write To Save Their Drying Crops ,penpahad Mandal , Drying Crops ,tr-TeluguStop.com

ఈ సందర్భంగా రైతులు ( Farmers )మాట్లడుతూ చివ్వెంల మండలం,పెన్ పహాడ్ మండలాలకు నీళ్లు ఇవ్వడంలో అధికారులు సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించారు.వెంటనే మా గ్రామాలకు నీళ్ళు అందేలా చూసి,పంటలు ఎండిపోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.

రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ సైదులు రైతులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు తోగరు లింగయ్య,సాదే సీతయ్య,కర్ణాకర్,శంకర్, భాస్కరాచారి,వెంకటేశ్వర్లు,అజయ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube