సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన ఇంటిని అన్యాయంగా,అక్రమంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మున్సిపాలిటీ అధికారులచే కూల్చి వేయించారని ఆరోపిస్తూ ఎస్సీ,ఎస్టీ, బీసీ,బీఎస్పీ నాయకులతో కలిసి హుజూర్ నగర్ లో ధర్నా చేపట్టారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి స్థానిక ఇందిరా సెంటర్ లో ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ సైదిరెడ్డి ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని అనుమతులు ఉన్నా ఉద్దేశ పూర్వకంగానే తన ఇంటిని కూల్చివేశారని శ్రీనివాస్ మండిపడ్డారు.ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
సైదిరెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీల జోలికి వస్తే సహించేది లేదని,కబడ్దార్ సైదిరెడ్డి అంటూ రాష్ట్ర చాకలి సంఘం అధ్యక్షురాలు శ్రీలక్ష్మీ హెచ్చరించారు.తక్షణమే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు,ఆందోళనకారుల మధ్య తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకొంది.దీంతో ఆందోళనకారులను స్టేషన్ కి తరలించారు పోలీసులు.
ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా చేసి ప్రజా రవాణకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఎంపీపీ శ్రీనివాస్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.