యాదాద్రి భువనగిరి జిల్లా:సీఎం ప్రధాన సలహాదారుడు,మాజీ సీఎస్ సోమేశ్ కుమార్( CS Somesh Kumar ) బుధవారం సతీసమేతంగా యాదాద్రి( Yadadri ) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు,అధికారులు స్వాగతం పలికారు.
ప్రధానాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసిన తర్వాత ఆలయ ఈఓ ఆయనకు లడ్డు ప్రసాదం అందజేశారు.సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా మంగళవారం నియమకమైన తర్వాత బుధవారం సతీసమేతంగా యాదాద్రి నరసింహుడిని సోమేశ్ కుమార్ దర్శించుకోవడం విశేషం.