విహార యాత్రలో విషాదం

సూర్యాపేట జిల్లా:సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.కర్ణాటకలోని మదికేరి వద్ద కోటే అబ్బి జలపాతంలో నీట మునిగి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు.

 Tragedy On A Cruise-TeluguStop.com

తెలంగాణకు చెందిన 16 మంది బంధు మిత్రులు విహార యాత్ర నిమిత్తం కర్ణాటక వెళ్లారు.కుశాలనగర్‌లోని ప్రైవేటు హోమ్‌స్టేలో బస చేసిన పర్యాటకులు,ఇవాళ కోటే అబ్బి జలపాతం చూసేందుకు వెళ్లారు.

సరదాగా నీటిలో దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం అసాధ్యంగా మారింది.

మృతులు కలకోట శ్యామ(38),శ్రీహర్ష (18),షాహీంద్ర (16)గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక గాలింపు చర్యలు చేపట్టారు.

గంటల తరబడి గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.అప్పటి వరకు సంతోషంగా తమ మధ్య ఉన్న ఆత్మీయులుు విగత జీవులుగా మారడంతో బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వీరు సూర్యాపేటకు చెందిన వారుగా తెలుస్తోంది.ఈ విషయం తెలిసి సూర్యాపేట పట్టణానికి చెందిన కలకోట వెంకన్న బంధు మిత్రుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube