జితేందర్ రెడ్డి,డీకే అరుణపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: బహుజన గౌడ బిడ్డ,తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్రపన్నిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కుట్రకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై గౌడ ఉద్యమ సంఘం జిల్లా అధ్యక్షులు గోపగాని రవికుమార్ గౌడ్ అన్నారు.

 Jitender Reddy And Dk Aruna Lodged A Complaint At The Police Station-TeluguStop.com

గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో,ఈ కుట్రకు సంబంధించిన వారిని,వారికి సుపారీ ఇచ్చిన జితేందర్ రెడ్డి,డీకే అరుణపై కేసు నమోదు చేయాలని కోరుతూ సూర్యాపేట సీఐ ఆంజనేయులుకు గురువారం పిటిషన్ అందజేశారు.అనంతరం గోపగాని రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ను,ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక హత్యకు కుట్ర పన్నారని తెలిపారు.

బహుజన గౌడ బిడ్డ జోలికి వస్తే ఈ రాష్ట్రంలో గౌడ్ ల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమ నియోజకవర్గ అధ్యక్షలు నక్క రమేష్ గౌడ్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చామకూరి మహేందర్ గౌడ్,జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు బంటు సందీప్ గౌడ్,పెద్ద వెంకన్న గౌడ్,నవీన్ గౌడ్,బాబు గౌడ్,పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube