ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి:జేసీ

సూర్యాపేట జిల్లా:ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు తెలిపారు.

 Public Should Be Used: Jc-TeluguStop.com

సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ విన్నపాలను జిల్లా అదనపు కలెక్టర్ కు అందజేశారు.ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా జిల్లా అధికారులకు అందజేసి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

నేటి ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్స్ సమస్యలపై 10 దరఖాస్తులు అందజేశారని,భూ సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు నుండి తాహాల్దార్లకు 49 దరఖాస్తులు,మొత్తం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 67 దరఖాస్తులు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్ర కుమార్,కిషోర్ కుమార్,అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube