సూర్యాపేట జిల్లా:ఈనెల 27న ఆర్టీసీ కళాభవన్ బాగ్ లింగంపల్లిలో జరిగే రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు రాంబాబు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టుల సమస్యల కోసం అనేక పోరాటాలు చేసి సాధించిన సంఘం టిడబ్ల్యూజే నని గుర్తు చేశారు.
అనంతరం హుజూర్నగర్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షునిగా చేపూరి శంకర్ అధ్యక్షునిగా రావుల రాజు కార్యదర్శిగా ఆర్లపూడి వీరభద్రం కోశాధికారిగా గుండా నరసింహారావు ఉపాధ్యక్షుడిగా బుడికి శంకర్,పల్లా వెంకటరెడ్డి,ముండ్ల నగేష్,చక్రవర్తి,కార్యవర్గ సభ్యులు ఉన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుక్క రాంబాబు,నాయిని శ్రీనివాసరావు,సాయి.
పాల్వాయి జానయ్యలు తదితరులు పాల్గొన్నారు.