సూర్యాపేట జిల్లా:రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు.ఇందులో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది.
సిబ్బందిలో క్రమశిక్షణ,సమన్వయం కోసం పోలీస్ పరేడ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ విఠల్ రెడ్డి, పట్టణ సిఐ ఆంజనేయులు,ఆర్ఐలు శ్రీనివాస్, గోవిందరావు,ఎస్ఐలు క్రాంతి కుమార్,యాదవెందర్ రెడ్డి,విష్ణు,శ్రీనివాస్,శ్రీకాంత్,సాయిరాం,నరేష్, యాకూబ్,ఏఆర్ సిబ్బంది,సూర్యాపేట పట్టణ మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు.