సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో సరికొత్త హంగులతో నిర్మాణం జరుపుకంటున్న జిల్లా పోలీస్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ నూతన కార్యాలయ నిర్మాణ పనులను అత్యంత జాగ్రత్తగా,నాణ్యతగా పూర్తి చేయాలని,త్వరగా పూర్తిచేసి భవనాన్ని అప్పగించాలని కాంట్రాక్టర్,సైట్ ఇంజనీర్స్ ను ఎస్పీ ఆదేశించారు.నిర్మాణ పనులపై అధికారుల పర్యవేక్షణ ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పిలు నాగభూషణం,వెంకటేశ్వర రెడ్డి,రవి,సిబ్బంది పాల్గొన్నారు.