తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో( Telangana Celebrations ) భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవం( Palle Pragathi Day ) కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి( Boppapur ) చెందిన పారిశుద్ధ కార్మికురాలు పండుగ భారతి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు.ఈరోజు పండుగ భారతిని ప్రజా ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.వో బింగి చిరంజీవి,ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి-శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ వంగ హేమలత-బాపురెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక -కిషన్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మాజీ ఏ.ఎం.సీ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా కోఆప్షన్ చాంద్ పాషా, అందే సుభాష్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు,పాలకవర్గం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.