కులాల బందులతో ప్రజలను మభ్య పెడుతున్నారు - కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :కులాల బందులతో ప్రజలను మంత్రి కేటీఆర్( Minister KTR ) మభ్యపెడుతున్నారని ఘాటుగా విమర్శించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు 2 ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు.

 People Are Being Deceived By Caste Bands - District Incharge Of Congress Party K-TeluguStop.com

అదేవిధంగా సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు ను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.గౌడ సంఘం నేతలు గట్టిగా మాట్లాడి పోరాటం చేస్తే ఈ పనులు జరిగాయన్నారు.

మంత్రి కేటిఆర్ ను గట్టిగా విమర్శిస్తే తప్ప పనులు చేయడం లేదన్నారు.దళిత బంధు, బీసీ బందు,మైనార్టీ బందు, క్రిస్టియన్ బంధు ఇలా బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు బాగుపడటానికి కోసం డబ్బులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని కానీ కులాలలో ఒకరిద్దరికీ ఇచ్చి వారి మధ్య గొడవలు పెట్టడం అన్యాయం అని అన్నారు.ఇప్పటివరకు ఇచ్చిన బందులలో కనీసం ఐదు శాతం కూడా ఇవ్వలేదన్నారు.

కులాల పేరిట సమాజంలో ఒక అడ్డుగోడలు నిర్మాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ అనడం సమంజసం కాదన్నారు.

స్వార్థం కోసం చేసే పనులు సమాజాన్ని ఎన్నడూ కూడా ఉద్ధరించలేమన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube