నిరుపేదలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే ప్రతిమ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాస్ రావు దీప దంపతులు స్పష్టం చేసారు.కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
![Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla](https://telugustop.com/wp-content/uploads/2023/03/prathima-foundation-free-medical-camp-at-mamidipally-village-detailss.jpg)
శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు సానిటరీ ఫ్యాడ్స్ అందించారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వికాస్ రావు దంపతులు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ప్రతిమ ఫౌండేషన్ టీం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.