రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ నియోజకవర్గం భీమారం మండలం వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన ఆడేపు దీక్షిత అనే యువతికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారతికి ప్రైవేట్ హాస్పిటల్ లో సర్జరీ జరుగగా ఆమెకు రక్తం అవసరం ఉందని వైద్యులు తెలుపడంతో విషయం తెలుసుకున్న ఆది సీనన్న బ్లెడ్ డోనర్ గ్రూప్ సభ్యుడు అదే గ్రామానికి చెందిన గంగ సారపు రంజిత్ అనే యువకుడు ఆసుపత్రికి వెళ్లి ఆమెకు రక్తదానం చేయడం జరిగింది.
సాటి మనిషికి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని రంజిత్ తన ఉదార స్వభావంతో రక్త దానం చేయడం పట్ల పలువురు అభినందించారు.
ఆది సీనన్న పేరుతో బ్లెడ్ డోనర్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇతరుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న గ్రూప్ సభ్యులను కూడా స్థానికులు అభినందించారు.